తెలంగాణలో కరోనా హైరానా.. పెరుగుతున్న కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

 Telangana State, Carona, Cases, Doctors, Patients-TeluguStop.com

మొన్నటి వరకు కేసులు అదుపులో ఉన్నట్లు అనిపించినప్పటికీ నిన్న ఒక్క రోజే 2,207 కేసులు నమోదయ్యాయి.ఒకే రోజు కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కి చేరింది.ప్రస్తుతం ఇందులో ఉన్న యాక్టివ్ కేసులు 21,412 ఉండగా.

ఇప్పటికే 53,239 మంది డిశ్చార్జ్ అయ్యారు.నిన్న ఒక్క రోజే 12 మంది మరణించగా.

దీని సంఖ్య 601కి చేరింది.

రాష్ట్ర ప్రభుత్వం కేసుల వివరాలను విడుదల చేసింది.ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా టెస్టులు 5,66,984 చేయగా.అందులో నిన్న ఒక్క రోజే 23,495 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.జీహెచ్ఎంసీ పరిధిలో 532 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసులు 41,725కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.కరోనా కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు వైద్యులు.

కేసుల తీవ్రత అధికంగా ఉన్న కారణంగా బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలంటున్నారు.సామాజికదూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube