తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పక్రియ వేగవంతంగా జరుగుతుంది.ఇన్నాళ్లూగా ఈ టీకా పట్ల ఆసక్తి చూపని వారు కూడా ఇప్పుడిప్పుడే ఈ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమం లో తెలంగాణ లోని రాజకీయ నేతలందరు దాదాపుగా వ్యాక్సిన్ తీసుకున్నారు.ఇంకా తీసుకుంటున్నారు.
అయితే తాజాగా తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నిమ్స్లో కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు.వీరే కాకుండా స్పీకర్, చైర్మన్ల సతీమణులు పుష్ప, అరుంధతి కూడా కరోనా టీకా తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ తాను మొదటి డోసు తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు సంభవించ లేదని, కాబట్టి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.ఇక కరోనా నియమ నిబంధలను తప్పక పాటించాలని వెల్లడించారు.