తెలంగాణ ప్రభుత్వం అమర్ రాజా బ్యాటరీ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఎంవోయూపై ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులు సంతకాలు పూర్తయ్యాయి.
మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ కుదిరింది.మహబూబ్ నగర్ జిల్లాలో లిథియం – అయాన్ బ్యాటరీకి సంబంధించి పరిశోధన, తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందమైందని అమర్ రాజా కంపెనీ సీఎండీ గల్లా జయదేవ్ తెలిపారు.పది ఏళ్లలో రూ.9,500 కోట్ల మేర పెట్టబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు.అమర్ రాజా గిగా కారిడార్ కోసం తెలంగాణను ఎంచుకున్నామని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.