తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది.ఇప్పటి దాక ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో కార్మికులు మండిపడుతున్నారు.23 వేల మందికి వేతనాలు ఇవ్వలేదని మొదటిసారిగా రెండు విడతలుగా వేతనాలు ఇస్తున్నారని. జేఏసీ నేతలు వాపోతున్నారు.
కరీంనగర్, హైదరాబాద్ జోన్ లలో ఉన్న కార్మిక సిబ్బందికి ఈనెల 16న బ్యాంక్ అకౌంట్ లో జీతాలు వేయడం జరిగింది.అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కార్మికులకు ఇంకా జీతాలు వెచ్చించకపోవడం తో జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
జీతాలు చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు.కరోనా సమయంలో జీతాలు సరిగా రాకపోయినా సర్దుకున్నాం అని కానీ జూలై 20 వచ్చినా గానీ ఇప్పటి వరకు జీతాలు వేయకపోవడం దారుణమని… రెండు విడతలుగా ఒకరికి ముందు మరొకరికి తర్వాత జీతాలు వేయడం సరైన విధానం కాదని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరో పక్క కార్మికులు ప్రభుత్వాన్ని సకాలంలో ఈసారి నుండైనా జీతాలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.