ఇద్దరు కూతుళ్ళ భవిష్యత్తు కోసం ఉన్న ఊరిని విడిచి పెట్టి మరీ దేశం కాని దేశం వెళ్ళిన ఓ తండ్రి గాధ.కడుపు తరుక్కుపోయే ఘటన సౌదీలో చోటు చేసుకుంది.
తెలంగాణా నుంచీ సౌదీ వెళ్ళిన శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడి యజమాని పెట్టే చిత్ర హింసలు బరించలేక, సొంత ఊరు చేరుకోలేక, కుటుంభాన్ని చూసుకోవాలనే కోరికతోనే మూగగా రోదిస్తూ సౌదీలో ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో కలకలం రేపింది.ఇంతకీ అసలేం జరిగింది.
ఎందుకు శ్రీనివాస్ ఆత్మ హత్య చేసుకున్నాడు అనే వివరాలలోకి వెళ్తే.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సుమారు రెండేళ్ళ క్రితమే సౌదీ లోని రియాద్ ప్రాంతానికి ఉద్యోగం కోసం వలస వెళ్ళాడు.
అక్కడ ఓ ఇంట్లో డ్రైవర్ గా పనిలో చేరాడు.కరోనా కారణంగా అతడికి డ్రైవర్ పని పెద్దగా లేకపోవడంతో సదరు యజమాని అతడితో గొడ్డు చాకిరీ చేయించేవాడు.
అంతేకాదు అతడు చేయలేని పనులు కూడా బలవంతంగా చేయిస్తూ యజమాని చిత్ర హింసలకు గురిచేశాడు.తిండి సరిగా పెట్టకుండా వేధించే వాడు.
దాంతో శ్రీనివాస్ అనారోగ్యం పాలవ్వడంతో ఆపరేషన్ పడింది.ఆపరేషన్ జరిగి కుట్లు కూడా మానకుండానే యజమాని పనులు చెప్తూ హింసించడంతో శ్రీనివాస్ అక్కడి నుంచీ పారిపోయాడు.
దాంతో సదరు యజమాని శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడంతో పటు అతడు ఎటూ వెళ్ళిపోకుండా వాంటెడ్ లిస్టు లో పెట్టించాడు.ఈ క్రమంలోనే రియాద్ నుంచీ సుదూరంగా వెళ్ళిన శ్రీనివాస్ కి అక్కడి నుంచీ ఎలా భారత్ వెళ్ళాలో తోచలేదు.
ఒక పక్క సొంత ఊరు, కుటుంబ సభ్యులను చూసుకోవాలనే బెంగ పెరిగిపోవడంతో బయటపడే దారులు లేకపోవడంతో శ్రీనివాస్ మానసికంగా కుంగిపోయి ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.తాను ఆత్మ హత్య చేసుకుంటున్నట్టుగా తన భార్యకు చెప్పి మరీ చనిపోయారని అతడి భార్య కన్నీరు మున్నీరు అవుతోంది.
స్థానికంగా ఉన్న తెలుగు ప్రవాస సంఘాలు శ్రీనివాస్ మృత దేహాన్ని అతడి ఊరికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.