తెలంగాణాలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో నియోజకవర్గాల వారీగా ఎంత మంది ఎన్నికల బరిలో ఉన్నారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.తెలంగాణ వ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థుల సంఖ్యను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.
మొత్తం 119 నియోజకవర్గాల్లో 1824 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టు తెలిపింది.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బరిలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఆ తర్వాతి స్థానంలో నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ ఉన్నాయి.తెలంగాణలోని పాత జిల్లాల్లో నియోజకవర్గాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జిల్లా – నియోజకవర్గాల సంఖ్య – బరిలో ఉన్న అభ్యర్థులు
హైదరాబాద్ – 15 – 313 మంది
రంగారెడ్డి – 17 – 304 మంది
నల్గొండ – 12 – 211 మంది
మెదక్ – 11 – 124 మంది
మహబూబ్నగర్ – 11 – 178 మంది
కరీంనగర్ – 12 – 175 మంది
వరంగల్ – 12 – 172 మంది
ఖమ్మం – 10 – 133 మంది
ఆదిలాబాద్ – 10 – 123 మంది
నిజామాబాద్ 9 – 91 మంది
.