తెలంగాణ పోలింగ్.. మరో అరగంట మాత్రమే ఓటుకు సమయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు మరో అరగంట మాత్రమే సమయం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం పోలింగ్ నమోదు అయింది.ఇక అదే మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం ఓటింగ్ నమోదు అయింది.అలాగే ఆదిలాబాద్ లో 62.34 శాతం, జనగామలో 62.24 శాతం, భూపాలపల్లిలో 64.30 శాతం, మేడ్చల్ జిల్లాలో 38.27 శాతం,రంగారెడ్డి జిల్లాలో 42.43 శాతం, సంగారెడ్డిలో 56.23 శాతం, హన్మకొండలో 49 శాతం, కరీంనగర్ లో 56.04 శాతం,ఖమ్మంలో 63.63 శాతం, మహబూబ్ నగర్ జిల్లాలో 58.89 శాతం పోలింగ్ నమోదు అయింది.

తాజా వార్తలు