తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇప్పటివరకు కల్పిస్తున్న 4 +4 భద్రతను తెలంగాణ పోలీసులు ఉపసంహరించుకున్నారు.తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఎన్నికల సమయంలో నా మీద దాడి జరిగే అవకాశం ఉందని రేవంత్ ఎన్నికలకు ముందు హైకోర్టు లో పిటిషన్ వేయడంతో… ఆయన భద్రత నిమిత్తం 4 ప్లస్ 4 భద్రతను ఏర్పాటు చేయాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
దీంతో రేవంత్కు ఆ మేరకు భద్రతను తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేశారు.అయితే హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ రోజు వరకే భద్రతా కొనసాగించాలని ఆదేశాలిచ్చింది… కౌంటింగ్ పూర్తైనందున భద్రతను ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ పోలీసు శాఖ ప్రకటించింది.