ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది.ఇప్పటికే లక్షలమంది వైరస్ బారినపడగా.
అదే స్థాయిలో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.ఈ లిస్టులో భారతీయులు కూడా ఉన్నారు.
తాజాగా కువైట్లో ఓ భారతీయ కార్మికుడు కరోనాతో కన్నుమూశాడు.తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన యడ్ల పౌల్రాజ్ అలియాస్ బాల గంగాధర్ (44) ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం కువైట్కు వెళ్లాడు.
అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో బాల గంగాధర్కు కరోనా పాజిటివ్గా తేలింది.
దీంతో అతనిని తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ బాల గంగాధర్ మే 28న ప్రాణాలు కోల్పోయాడు.
కువైట్లోని భారత రాయబార కార్యాలయం అతని మరణ వార్తను భారత్లోని కుటుంబసభ్యులకు తెలియజేశారు.కాగా … గడిచిన 24 గంటల్లోనే 719 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కువైట్లో వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 27,762కి చేరింది.
కోవిడ్ 19 కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో.అక్కడ మొత్తం మృతుల సంఖ్య 220కి చేరింది.