తెలంగాణ ఎన్నికల్లో కాస్త వెనుకబడ్డట్టు కనిపిస్తున్న బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో కాస్త తేరుకున్నట్టు కనిపిస్తోంది.తెలంగాణాలో ఇప్పటికే అన్ని పార్టీలు తాము ఏమి చేయబోతున్నామో వివరిస్తూ… పార్టీ మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి.
కాగా ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.అంతే కాదు బీజేపీ మ్యానిఫెస్టోని కాంగ్రెస్ కాపీ కొట్టిందని …ఇంటి అద్దె ఇస్తామని తమ హామిని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిందన్నారు.
సీపీఎస్ రద్దు, పదవీ విరమణ వయస్సు 60కి పెంచుతామని, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు.జైలుకు వెళ్లిన ఉద్యమకారులకు రూ.5000 పెన్షన్, అమరులకుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.రజకులకు, డప్పు కొట్టే వారికి రూ.3వేల పెన్షన్ ఇస్తామని, మూతపడిన పరిశ్రమల కోసం 2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని హామీలతో కూడిన పార్టీ మ్యానిఫెస్టో ను ఆయన విడుదల చేశారు.