తెలంగాణలో రాజకీయానికి ఫంగస్ సోకిందట.అందుకే కావచ్చూ ఇక్కడి పాలన నత్త కంటే అధ్వాన్నంగా సాగుతుందని, కేవలం రాజకీయ పోరు, పదవుల కోసం ఆరాటం తప్పితే ప్రజల సంక్షేమం పడకేసిందనే ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయట.
అందులో తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల పై ఫోకస్ పెట్టినట్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై, కరోనా పై కూడా పెడితే నేడు ప్రజలకు ఈ దరిద్రం పట్టేది కాదుగా అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారట.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈటల వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కమళం కండువా కప్పుకోవడానికి మూహూర్తం కూడా ఖారారు అయ్యింది.ఈ నేపధ్యంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో దొరల పాలనలో జరుగుతున్న అరాచకాలకు అంతే లేదని, కేసీఆర్ పై ఈటల చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందని తెలిపారు.ఇక ఇక్కడ రాజకీయ యుద్ధం నడుస్తోందని… అది అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య నడుస్తున్న యుద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తెలంగాణకు విముక్తి కలుగలేదని కేసీఆర్ అహంకార పూరితమైన పాలన భూస్దాపితం అయినప్పుడే విముక్తి అని తరుణ్ చుగ్ చెప్పారు.