ఎన్నికల్లో హమీలతో ప్రజలను బోల్తా కొట్టే నాయకుల గురించి అందరికి తెలిసిందే.కానీ ఓటర్లు కూడా అప్పుడప్పుడు తమ నిజాయితీ నిరూపించుకుంటారు.
అదీ సమయం వచ్చినప్పుడు.కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రం నేతలకు ఓటర్లు జలక్ ఇస్తున్నారని సమాచారం.
ఎవరికి సృష్టమైన మెజారిటీ ఇవ్వకుండా మూడో రౌండ్ వరకు నేతల్లో టెన్షన్ క్రియేట్ చేశారు.ఇక మూడు రోజుల క్రితం జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ముమ్మరంగా సాగుతోంది.
ఇప్పటికే రెండు రౌండ్ల కౌంటింగ్ ముగియగా, మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతున్న క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదంటున్నారు.
కాగా ఓటర్లు ఇప్పటి వరకు ఎవరికి సృష్టమైన మోజారీటి ఇవ్వలేకపోయారు.
అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.తొలి, రెండో రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 31,987 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు రెండు రౌండ్లలో 24116 ఓట్లు వచ్చాయి.
ఈ లెక్కన చూస్తే ఏడు రౌండ్లు ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని సమాచారం.