తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ రోజు మరణించారు.ఇక గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్గౌడ్ తండ్రి సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో ఈ రోజు పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.ఇక శ్రీనివాస్ గౌడ్ తండ్రి మృతికి పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ఇకపోతే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, దామోదర్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ ను కలిసి పరామర్శించారు.శోకసంద్రంలో ఉన్న శ్రీనివాస్గౌడ్ తల్లి గారిని కవిత ఓదారుస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
వీరితో పాటూగా పలువురు గులాభి నేతలు కూడా శ్రీనివాస్ గౌడ్ ను కలసి పరమార్శించారట.ఇకపోతే తెలంగాణ ముఖ్య మంత్రి కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారట.