తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మహమ్మారి కరోనా గురించి కీలక కామెంట్లు చేశారు.గత ఏడాది దుబాయ్ నుండి సరిగ్గా ఇదే రోజు వచ్చిన వ్యక్తి లో కరోనా కేసు రావటం జరిగిందని.
కానీ ఆ సమయంలో గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది ఆత్మవిశ్వాసంతో చికిత్స అందించారని పేర్కొన్నారు.అద్భుతంగా గాంధీ హాస్పిటల్ వైద్యులు కరోనా సేవలు అందించారని.
మెరుగైన సేవలు అందించిన వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే సన్మాన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
మహమ్మారి కరోనా కట్టడి చేయటానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అని.దేశంలో మొట్టమొదటి సారి విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపినా ముఖ్యమంత్రి కేసీఆరే అని గుర్తు చేశారు.అంత మాత్రమే కాక దేశంలో ఫస్ట్ లాక్ డౌన్ చేపట్టిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ తో అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నాయి, కానీ అలాంటి పరిస్థితి.తెలంగాణలో లేదని స్పష్టం చేశారు.అంతమాత్రమే కాకుండా వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
.