తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లు క్లోజ్ వార్తలపై స్పందించారు.తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల విద్యాసంస్థలు క్లోజ్ అవటంతో.
థియేటర్లు కూడా క్లోజ్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు రావటం జరిగాయి.దీంతో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
కరోనా నిబంధనల ప్రకారం రాష్ట్రంలో థియేటర్లు యధావిధిగా రన్ అవుతాయని స్పష్టం చేశారు.కరోనా లాక్ డౌన్ వల్ల ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ భారీగా నష్టపోవడం జరిగిందని, అనేక మంది ఉపాధి కోల్పోయారని, ఈ క్రమంలో ప్రభుత్వం కొంతవరకు ఆదుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సినిమా ధియేటర్లు మూసివేసే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.కరోనా నిబంధనల మేరకు థియేటర్లు ఓపెన్ అవుతాయి అని .థియేటర్లు మూసివేస్తున్నట్లు వస్తున్న ఈ వార్తలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
.