అదృష్టం ఎవరికి ఏ రూపంలో వరిస్తుందో అనేది ఎవరికి చెప్పలేం.ఒక్కోసారి లక్కు మనం రోడ్డు వెళ్తున్న సమయంలో కూడా అనుకోకుండా తగిలే అవకాశం ఉంటుంది.
కొంతమందికి ఎంత కష్టపడినా అదృష్టం అసలు కలిసి రాదు.అయితే అప్పుడప్పుడు అనుకోకుండా కొన్న లాటరీ టికెట్ రూపంలో కూడా అదృష్టం ఇంటి తలుపు తట్టవచ్చు.
ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్ కి చెందిన విలాస్ అనే వ్యక్తికి అలాగే అదృష్టం పట్టింది.దుబాయ్ లాటరీ రూపంలో అతనికి ఏకంగా 30 కోట్లు వరించింది.
ఉపాధి కోసం భార్యతో కలిసి దుబాయ్ వెళ్లిన విలాస్ కి అక్కడ ఆశించిన పని దొరకక పోవడంతో 45 రోజుల క్రితం తిరిగి వచ్చే క్రమంలో తన మిత్రుడు రవికి డబ్బులు ఇచ్చి లాటరి టికెట్ కొనమని చెప్పాడు.అలా కొన్న లాటరీ టికెట్ ఇవాళ ఏకంగా 30 కోట్లు తెచ్చిపెట్టింది.
లాటరీ నిర్వాహకులు ఈ విషయాన్ని విలాస్ కు తెలియజేశారు.అయితే తన భార్య కారణంగా తనకు ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పుకురావడం విశేషం.
గతంలో తాను చాలా సార్లు టికెట్ కొన్న ఎప్పుడు కూడా లాటరీ తగ్గలేదని, అయితే ఈసారి తన భార్య దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ కొనడంతో అదృష్టం వరించిందని చెప్పుకొచ్చాడు.మొత్తానికి దుబాయ్ లాటరీ లో 30 కోట్లు సొంతం చేసుకొని ఇప్పుడు ఈ నిజామాబాద్ వ్యక్తి కోటీశ్వరుడుగా మారిపోయాడు.