కరోనా సమయంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చిన సినీ నటుడు విలన్ సోనూ సూద్.తను ఇప్పటివరకు చేసిన సహాయం గురించి అందరికీ తెలిసిందే.
తను చేసిన సహాయం కు గుర్తింపుగా ఏకంగా తనకు గుడి కట్టించిన గ్రామస్తులు….
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా, దుబ్బ తండాకు చెందిన గిరిజనులు సోనూ సూద్ చేసిన సహాయానికి, తన సేవలకు ఆకర్షితులైన గ్రామస్తులు ఆయనకు గుడి కట్టారు.
ఆయన చేసిన సహాయం చూసి తనని మరువలేము అంటూ ఆయన గుర్తింపు కై ప్రత్యేకంగా గుడి కట్టించాము….ఇందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
కరోనా వైరస్ మొదటి నుండి ఇప్పటివరకు ఏదో ఒక రూపంలో తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు.సహాయం చేయడానికి రాజకీయమే కాదు మంచి మనసు ఉంటే చాలని నిరూపించుకున్నాడు సోనూసూద్.సినిమాల్లో విలన్ గా నటించిన తను….నిజ జీవితంలో ప్రజల గుండెల్లో నిజమైన హీరో గా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఎంతో మంది వలస కూలీల ను తమ సొంత గూటికి చేర్చాడు.రైతులకు సహాయం చేశాడు.
రాజకీయ నాయకుల నుండి వ్యతిరేకమైన విమర్శలు వచ్చినా….వాటిని పట్టించుకోకుండా తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు.ఆపదలో ఉన్న వారిని నా అంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉన్నాడు.విద్యార్థులకు కూడా సహాయం చేశాడు.
ఇటీవలే రైతుల సమస్యల గురించి పట్టించుకోకపోగా దానివల్ల ఎంతో బాధపడుతున్నానని తెలిపాడు.రైతుల సమస్యల గురించి ఇతరుల నుండి విమర్శలు రాగా వారి సమస్య ప్రభుత్వమే తీసుకోవాలని….
ప్రభుత్వంపై ఎటు వంటి విషయాలను తోసిపుచ్చలేమని….అంతేకాకుండా రాజకీయ పరంగా ఇలాంటి విమర్శలు రావడంతో బాధపడుతున్నానని సోనూసూద్ తెలిపారు.
రైతులు చేసిన నిరసన గురించి ఎప్పటికి మర్చిపోలేనని ఇటీవలే తెలిపారు.