కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.తెలంగాణ పారిశ్రామిక పురోగతికి సహకరించాలన్నారు.
తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు.కేవలం ఎనిమిదేళ్ల ప్రగతి ప్రస్థానంతోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని తెలిపారు.
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పారు.న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలని లేఖలో కోరారు.