తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.గతంలో ఫలితాల విడుదల విషయంలో అవకతవకలు జరగడంతో ఈ సారి అటువంటి పొరపాటు జరగకుండా ఫలితాలువిడుదల కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సరి కొత్త మార్గదర్శకాలు తెలంగాణ విద్యాశాఖ కరారు చేయడం జరిగింది.
ఆయా సబ్జెక్టులలో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నారు.ఈ క్రమంలో రెండో సంవత్సరం ఇంటర్ ప్రాక్టికల్ మార్క్స్ పూర్తిగా ఇవ్వనున్నారు.
అంతమాత్రమే కాకుండా గతంలో ఫెయిల్ అయిన సభ్యులకు 35 శాతం మార్కులను.బ్యాక్లాగ్ సబ్జెక్టు ఉంటే.ఆ సబ్జెక్ట్ కి కూడా 35 మార్కులను జత చేయనున్నారు.అంతమాత్రమే కాకుండా ప్రైవేటు గా దరఖాస్తు చేసిన వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది.
ఈ క్రమంలో మార్కుల విషయంలో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.ఇదే రీతిలో జులై 1 నుండి తెలంగాణ విద్యా సంస్థలు ప్రారంభం ఆన్లైన్ తరగతుల విషయంలో అధికారులతో.
సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు.