తెలంగాణ హైకోర్టులో పబ్స్పై నేడు మరోసారి విచారణ జరగనుంది.గత విచారణలో రాత్రి 10 గంటల తర్వాత పబ్ల్లో డీజేకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.
అదేవిధంగా హైదరాబాద్ పరిధి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో నేటి విచారణలో నివేదికను సీపీలు కోర్టుకు సమర్పించనున్నారు.
మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో ధర్మాసనం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.