టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా… ఏర్పడిన మహాకూటమి ( ప్రజాకూటమి) కి సంబంధించిన మ్యానిఫెస్టోను తాజాగా విడుదల చేశారు.తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పడిన ప్రజాకూటమికి సంబంధించిన పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్, తెలుగుదేశం , తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీల నేతలు ఉమ్మడిగా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.ఇది కేవలం ప్రజా ప్రతిపాదికన విడుదల చేశామని.
అవసరాలకు తగ్గట్లు కొత్తగా అంశాలు చేరుతాయన్నారు.ప్రజా ఫ్రంట్ కూటమికి నామకరణం చేసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో అవినీతి నిర్మూలనను ప్రధాన అంశంగా చేర్చారు.
ప్రజా ఫ్రంట్ కు టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంను కన్వీనరుగా నియమించారు.ప్రజాకూటమి తరపున కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను కోదండరాం ప్రకటించారు.రైతులకు 2 లక్షల రుణమాఫీ, తొలి సంవత్సరంలో లక్షల ఉద్యోగాల భర్తీ, వికలాంగులకు 3 వేల పెన్షన్ తో పాటు ప్రస్తుతం ఉన్న కల్యాణ లక్ష్మి లాంటి పథకాలను కొనసాగిస్తూ కొత్తగా మరికొన్ని అంశాలను జతచేయనున్నామని ప్రకటించారు.