తెలంగాణలో రాష్ట్రంలో గృహ వినియోగదారులు 88 లక్షలమంది ఉంటే, వీరిలో 80లక్షల మందిపై పెంపుదల ప్రభావం ఏమీఉండదు అని కెసిఆర్ చెప్పారు .200 యూనిట్ల వరకూ ఎలాంటి చార్జీల పెంపుదల లేకుండా ఆంద్ర ప్రదేశ్ మాదిరి చెప్పారు .200 యూనిట్ల తరువాత సగటున యూనిట్కు 42 పైసలు పెంచారు.చార్జీల పెరుగుదల వల్ల ప్రజలపై 816 కోట్ల పెనుభారం పడుతోంది.
అయితే వీటిలో పౌల్ట్రీ పరిశ్రమకు విద్యుత్ చార్జీలు తగ్గించారు .వారికి సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుంది.పరిశ్రమలకు మాత్రం దాదాపు 5 శాతం వరకూ విద్యుత్ చార్జీలు పెంచారు.వ్యసాయ విద్యుత్పైన, కాటేజ్ ఇండస్ట్రీస్పైన ఎలాంటి పెంపుదల లేదు.విద్యుత్ వినియోగదారుల్లో వీరి సంఖ్య దాదాపు 18 లక్షలు.గృహేతర వినియోగదారులకు 50 యూనిట్ల వరకూ ఎలాంటి పెంపుదలా లేదు.
ఆంధ్రప్రదేశ్ ను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కెసిఆర్ పెంచేసారని కాంగ్రెస్స్ నేతలు దుయ్యబట్టారు .