సమ్మెపై కేంద్రం వేచి చూసే దోరణి

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పరిస్థితి, ఉదృతిని ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్‌ షాలు గవర్నర్‌ తమిళిసై వద్ద అడిగి తెలుసుకున్నారు.తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఢిల్లీకి వెళ్లిన తమిళిసై ప్రధాని మోడీమ రియు అమిత్‌ షాలతో భేటీ అయ్యింది.

 Telangana Governor Meet In Indian President-TeluguStop.com

ఈ సందర్బంగా ఆమె రాష్ట్రంలోని పరిస్థితులను మరియు రాజకీయాలను గురించి వారికి వివరించినట్లుగా సమాచారం అందుతోంది.

సమ్మె గురించి ప్రధానంగా చర్చ జరిగిందట.

ఆర్టీసీ కార్మికుల సమ్మె మరియు ఆత్మహత్యల గురించి కూడా ఒక సమగ్ర నివేదికను గవర్నర్‌ ప్రధానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రధాని మరియు గవర్నర్‌లు భావిస్తున్నారట.

బీజేపీకి అనుకూలంగా సమ్మెను మల్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రధాని మరియు హోం మంత్రిలు ఈ విషయంపై స్పందించనక్కర్లేదని భావిస్తున్నారు.

వేచి చూసి సమయం వచ్చినప్పుడు స్పందిస్తారని బీజేపీ నాయకులు అనధికారికంగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube