బంపర్ ఆఫర్: నల్లా బిల్లులు కట్టని వారికి మాత్రమే..!

నల్లా బిల్లులు కట్టని వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లులు బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

 Telangana, Water Board, Pending Water Bills, Minister Ktr-TeluguStop.com

మంగళవారం ప్రగతి భవన్‎లో జగల మండలి వన్ టైం సెటిల్‎మెంట్ పథకం కరపత్రాలు, పోస్టర్లను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నల్లా బిల్లులు కట్టని వారికి వడ్డీ మాఫీ చేస్తున్నట్లు, కేవలం అసలు మాత్రమే చెల్లిస్తే చాలని స్పష్టం చేశారు.

Telugu Ktr, Bills, Telangana, Board-Latest News - Telugu

అయితే ఈ పథకం ఆఫర్ ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు అంటే 45 రోజుల పాటు అమలులో ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.జలమండలికి బిల్లులు క్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.ఇప్పటికే ఓటీఎస్ (వన్ టైం సెటిల్‎మెంట్ పథకం)కు సంబంధించిన జీవోను రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల28వ తేదీన జారీ చేశారు.పెండింగ్ లో ఉన్న బిల్లులను వసూలు చేసి బోర్డు ఆదాయం పెంచాలని జలమండలి సిబ్బందికి మంత్రి కేటీఆర్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube