కరోనా వైరస్ కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.కరోనా నిబంధనలు పాటిస్తూ మరోపక్క బహిరంగ సమావేశాలకు, యాత్రలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
మేటర్ లోకి ఎంత దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో బయటపడుతూ ఉండటంతో.మహారాష్ట్ర కు సంబంధించి రాకపోకలనునిలిపివేసింది.
రెంజల్ మండలం కందకుర్తి చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిషేధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర నుండి వస్తున్నా పది మందిలో ఎనిమిది మందికి జరుగుతున్న కరోనా పరీక్షలలో పాజిటివ్ రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కరోనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన నాటినుండి మహారాష్ట్రలోని అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
దీంతో ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కంట్రోల్ చేయడం కోసం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ.వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు వంటి వాటిపై కూడా ఆంక్షలు విధించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
.