కరోనా ప్రజలను పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ చేస్తున్న విద్వంసం చూస్తుంటే ఈ మాటలు నిజమని అనిపిస్తుంది.
ఇకపోతే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనా కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు.
ఈ సెకండ్ వేవ్లో ఈ వైరస్ ప్రతి వారిని పలకరిస్తుంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు.అదీగాక గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో గాంధీని పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్చేశారు.
ఇకపోతే కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కార్మికులు, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందట.ఈమేరకు వీరందరికి ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మీ తెలిపారు.
కాగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు, ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మేయర్ కోరుతున్నారు.