తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్దిరోజులుగా నిలిపివేశారు.అయితే ఇవాట్లి నుడి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈసారి 18 ఏళ్లు పై బడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యునిటీల్లోనూ వ్యాక్సిన్ అమలు చేసినట్టు తెలుస్తుంది.అయితే వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు కొవిడ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓ పక్క దేశం మొత్తం 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది.ఇన్నాళ్లు వ్యాక్సిన్ కొరత వల్ల కేవలం 45 ఏళ్లు పై బడిన వారికే వ్యాక్సిన్ అందించారు.ఇక ఇప్పుడు 45 ఏళ్లు పై బడిన వారికి సెకండ్ డోస్ తో పాటుగా 18 నుండి 44 ఏళ్ల మధ్య వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేస్తున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ కు వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు కొద్దిగా వెసులు బాటు ఉంటుంది. ఇక తెలంగాణాలో మే 12 నుండి లాక్ డౌన్ కొనసాగుతుంది.
మే 30 వరకు లాక్ డౌన్ ఉండగా 29న మళ్లీ లాక్ డౌన్ పొడిగించాలా లేదా అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.