ఈఆర్సీ విభజనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఉమ్మడి ఏపీ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని కొత్తగా ఏర్పడిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విభజిస్తూ గతంలో ప్రతిపాదనలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో విభజన ప్రతిపాదనలకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు చేసిన పంపకాలను ఆమోదించాలని మండలి రాసిన లేఖకు స్పందించింది.
ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు ఇంధన శాఖ తెలిపింది.ఈఆర్సీ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన కూడా పూర్తయినట్లు వెల్లడించింది.