అధికార పక్షం మీద ఇప్పుడిప్పుడే నోరు లేస్తోంది విపక్షానికి , తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నరిసి రెడ్డి ఇప్పుడు అధికార పార్టీ మీడియా యమా సీరియస్ అవుతున్నారు.
తెలంగాణా ప్రభుత్వం మీద కోప్పడిన ఆయన త్యాగాల తెలంగాణా ని తాగుబోతుల తెలంగాణా గా మార్చేసారు అనీ ఈ గొప్పతనం కెసిఆర్ కే చెల్లింది అనీ అన్నారు.
రోడ్డు ప్రమాదం లో మరణించిన రమ్య విషయాన్ని అందరూ మరచిపోవడం కోసమే కేటీ ఆర్ ప్రత్యేక పర్యటనలు చేపట్టారు అని ఆయన విపర్సించారు.
అర్థరాత్రి ఆకస్మిక పర్యటనలు.
బార్ల మీద దాడులు.మైనర్ల అరెస్ట్ లు లాంటివన్నీ ప్రచారం కోసమే తప్పించి మరొకటి కావని ఆరోపించారు.
ప్రాంతాల వారీగా లక్ష్యాలు పెట్టి మరీ మందును అమ్మిస్తున్న తెలంగాణ సర్కారు ఈ రోజు రూల్స్ గురించి మాట్లాడటం ఏమిటంటూ ప్రశ్నించారు.