తెలంగాణాలో పోలింగ్ ముగిసింది.ఇక ఏ పార్టీ గెలవబోతోంది అనే విషయంలో అందరికి ఆసక్తితో కూడిన టెన్షన్ మొదలయ్యింది 11 వ తేదీ నాటికి కానీ ఎన్నికల ఫలితాలు వెలువడవు.
కానీ ఈ సమయంలోనే ఈ పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది అనే విషయం పై రకరకాల సంస్థలు ముందస్తుగా ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి.
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.టీఆర్ఎస్కు 50 – 65 సీట్లు వస్తాయని.ప్రజాకూటమికి 38-52 స్థానాలు, బీజేపీకి 4-7, ఇతరులు 10 – 17 స్థానాల్లో గెలవనున్నారని ఎగ్జిపోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.62 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.
టైమ్స్ నౌ – సియెన్ఎక్స్ సర్వేలోనో… టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అనే ప్రకటించాయి.ఈ ఎగ్జిట్స్ పోల్ ప్రకారం టీఆర్ఎస్ – 66 , ప్రజకూటమి – 37 , బీజేపీ 07 , ఇతరులు – 09 వస్తాయని ప్రకటించింది.
తాజా వార్తలు