ప్రస్తుత హైదరాబాద్ మేయర్ పాలకమండలి పదవి కాలం వచ్చే నెల 11 తో ముగియనున్నది.గత ఏడాది గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్ల నుండి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్ల పేర్లను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.
జనవరి 16 వ తేదీ తో కలిపి గెజిట్ ను జారీ చేశారు.
అందులో 150 డివిజన్ల నుండి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్ల పేర్లు ఉంటాయి.
అదే విదంగా వారు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు, ఏ రిజర్వేషన్స్ లు తదితర విషయాలు అందులో ఉంటాయి.ఇది మొదటి నోటిఫికేషన్ గా జారీ చేశారు.
రెండో నోటిఫికేషన్ ను త్వరలో జారీ చేస్తారు.అందులో నగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కొరకు కొత్త పాలక మండలి మొదటి సమావేశం నిర్వహించాలిసి ఉంటుంది.
త్వరలో రెండో తేదీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉంటుంది.