అమెరికా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పోర్ట్ ల్యాండ్ లో వనభోజనాలు నిర్వహించారు.ఫోర్ట్ ల్యాండ్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీని ముందుగా తెలంగాణా ప్రొఫెసర్ జయశంకర్ కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వన భోజనాలకి పోర్ట్ ల్యాండ్ మెట్రో నగరాల నుంచీ అధిక సంఖ్యలో తెలుగు వారు తరలి వచ్చారు.ఈ సంస్థ సభ్యులే అక్కడ స్వయంగా తెలంగాణా వంటలని తయారు చేసుకుని అందరికి వడ్డించారు.
అలాగే ఈ భోజనాలకి ముందు అందరూ సరదాగా పిల్లలు పెద్దలు కలిసి వాలీబాల్, చెస్,క్యారమ్స్ , బ్యాడ్మింటన్ వంటి స్పోర్ట్స్ ఆడుకున్నారు.అదేవిధంగా మహిళలు, వంటలతో ఘుమ ఘుమలతో అదరగొడుతుంటే ఆట పాటలతో పిల్లలు కార్యక్రమానికి మరింత ఉశ్చాహాన్ని తెచ్చి పెట్టారు.
ఈ వనభోజనాలని విజయవంతం చేసినందుకు గాను సంస్థ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
సంస్థ అధ్యక్షుడు శ్రీని జ్ఞాపికలు అందించారు.
అలాగే స్పోర్ట్స్ లో ఫన్ గేమ్స్ లో సరదాగా పాల్గొని విజేతలుగా నిలిచినా వారికి కూడా బహుమతులు అందించారు.సంస్థ వాలంటీర్లకి , సభ్యులకి ప్రతీ ఒక్కరికి శ్రీని కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని, అందుకు అందరి మద్దతు కావాలని శ్రీని కోరారు.