భారతీయులకు కరోనా ముప్పు తక్కువని భావించిన మనదేశ ప్రజలు అసలు మాస్కులు ధరించకుండా పంక్షన్లకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఇక కరోనా నిబంధనలు అయితే పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా వినిపించుకునే వారే కరువు అయ్యారు.
ఈ క్రమంలో కరోనా కేసుల సంఖ్య కూడా పెరగడం మొదలు పెట్టింది.ఇప్పటికే ముంబాయి, కెరళ, మహరాష్ట్రలో ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ఇకపోతే తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా వివరాలు చూస్తే.
తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 189 కేసులు నమోదయ్యాయట.
కాగా ఇద్దరు కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారట.తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,453కి చేరుకోగా, ఇప్పటి వరకు 1,632 మంది కరోనాతో మరణించారని, 2,94,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,910 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.