కరోనా వైరస్ దేశంలో ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించేస్తోంది.
ఇంకా తెలంగాణలోనూ రోజుకు 15వందలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా భాదితులకు సరైన వైద్యం లేదంటే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజలకు పలు సూచనలు చేశారు.రోగనిరోధక శక్తి లేనివారికే కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
అంతేకాదు కరోనా వైరస్ ను కేవలం వెయ్యి రూపాయలతో చెక్ పెట్టచ్చు అని తెలిపారు.
ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రిలో ట్రూనాట్ టెస్ట్ కేంద్రాన్ని మంత్రి అజయ్ తో కలిసి ఈటల రాజేందర్ ప్రారంభించారు.
వెయ్యి మంది కరోనా వైరస్ బారిన పడితే కేవలం 200 బెడ్స్ మాత్రమే అవసరం అని, పిహెచ్సి స్థాయిలోనే కరోనా వైరస్ ను అంతం చెయ్యచ్చు అంటూ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.ఇంకా ఈ వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ అవసరమైన నిధులు కేటాయించినట్టు అయన తెలిపారు.
కాగా తెలంగాణాలో 62 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.