దేశంలో మరోసారి కరోనా కహానీ మొదలైంది.కరోనా లేదు గిరోనా లేదని గత సంవత్సరం జ్ఞాపకాలను మరచి బ్రతుకుతున్న ప్రజల జీవితాల్లోకి మరోసారి తొంగి చూస్తున్నాడు కరోనా కంత్రిగాడు.
ఈ క్రమంలో మళ్లీ కోవిడ్ కేసుల విజృంభణ మొదలైంది.
ఇక తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈ రోజు ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
వారి వివరాల ప్రకారం.తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 535 కరోనా కేసులు నమోదయ్యాయిని వెల్లడించింది.
కాగా ఒక్కరోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇదే సమయంలో 278 మంది కోలుకున్నారని పేర్కొంది.
ఇకపోతే రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులను చూస్తే కోవిడ్ బాధితుల సంఖ్య 3,06,339కి చేరగా, మృతుల సంఖ్య 1,688గా ఉందట.
అయితే ఇప్పటి వరకు మొత్తం 3,00,156 మంది కరోనా నుండి కోలుకోగా, ప్రస్తుతం 4,495 మంది కరోనాకు చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్యశాఖ పేర్కొంది.ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 154 మందికి కరోనా సోకిందని తెలిపింది.
రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా వెల్లడించింది.