తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య దినదినం పెరుగుతుండటం వల్ల ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట .ఇప్పటికే ఆర్ధికంగా చితికి పోయిన మధ్య తరగతి ప్రజలను రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ మరింత భయానికి గురిచేస్తుందంటున్నారు.
ఇప్పటికే తెలంగాణలో వ్యాపించడం ప్రారంభం అయినా కరోనా వల్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రజలు కరోనా కట్టడికి సహకరిస్తే తప్ప ఈ వైరస్ను నిలువరించడం సాధ్యం కాదు.
ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
వీరి లెక్కల ప్రకారం.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయిని, కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 194 మంది కోలుకున్నారని వెల్లడించింది.ఇకపోతే రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118 ఉండగా, ప్రస్తుతం వరకు 2,98,645 మంది కోలుకున్నారని, మృతుల సంఖ్య 1,669గా ఉందని పేర్కొంది.
ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 81 మందికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.