తెలంగాణలో కరోనా మహమ్మారి జోరు క్రమంగా తగ్గుతూ వస్తుంది.తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటలకు 38,895 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
దీనితో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,670కి చేరుకుంది.అలాగే , నిన్న ఒక్క రోజే కరోనా బారినపడి 8 మంది కన్నుమూశారు.
దీనితో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,249కి చేరింది.
అలాగే , తాజాగా గత 24 గంటల్లో 1,949 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,93,218కి చేరింది.రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి.వీరిలో 19,084 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.తెలంగాణలో ఇప్పటి వరకు 37,03,047 మందికి కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహించారు.
తాజాగా వెల్లడించిన కరోనా బులిటెన్ లో జిల్లాల వారిగా నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య .ఆదిలాబాద్ లో 25, భద్రాద్రి కొత్తగూడెం 99, జీహెచ్ఎంసీ పరిధిలో 244, జగిత్యాలలో 28, జనగామలో 19, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో 18, జోగులాంబ గద్వాలలో 11, కామారెడ్డిలో 22, కరీంనగర్లో 74, కొమురంభీం అసిఫాబాద్ లో 8, మహబూబ్నగర్ లో 21, మహబూబాబాద్ లో 41, మంచిర్యాలలో 25, మెదక్లో 25, మేడ్చల్ మల్కాజ్గిరిలో 115, ములుగులో 22, నాగర్కర్నూల్ లో 13, నల్గొండలో 74, నారాయణ్పేటలో 4, నిర్మల్లో 22, నిజామాబాద్లో 27, పెద్దపల్లిలో 32, రాజన్న సిరిసిల్లలో 24, రంగారెడ్డిలో 88, సంగారెడ్డిలో 28, సిద్దిపేటలో 31, వికారాబాద్లో 15, సూర్యాపేటలో 53, వనపర్తిలో 28, వరంగల్ రూరల్లో 34, వరంగల్ అర్బన్లో 46, యదాద్రి భువనగిరిలో 25 ఉన్నాయి.
.