తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నేటి కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 163 కేసు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది.
ఇక ఇదే టైమ్ లో నూట ఒక్క మంది గడచిన 24 గంటల్లో కరోనా నుండి రికవరీ అవటంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2,93,791 మంది కోలుకున్నారు.
ఇక మృతుల సంఖ్య చూసుకుంటే గడచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా వలన మృతి చెందటంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 1,622 కి చేరుకుంది.
ఇక యాక్టివ్ సంఖ్యల చూసుకుంటే 1,700 మంది ఉన్నట్లు వీరిలో కొంతమంది ఆసుపత్రిలో, మరికొంతమంది ఇంటిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
.