30 వేల మెజార్టీతో గెలిచి తీరుతాం

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే స్థానంకు రాజీనామా చేసిన విషయం తెల్సిందే.ఆ స్థానంకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి.

 Telangana Congress Uttam Kumar Reddy Comments On Media Meeting About Congress P-TeluguStop.com

ఆ ఎనినకలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికార టీఆర్‌ఎస్‌ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయి.తన పార్టీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు పీసీసీ చీప్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయన భార్య పద్మను బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ సమయంలోనే టీఆర్‌ఎస్‌ నుండి శానంపూడి సైదిరెడ్డిని బరిలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉత్తమ్‌ పద్మను గెలిపించుకునేందుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన హుజూర్‌ నగర్‌లో మరోసారి కాంగ్రెస్‌ జెండాను ఎగరవేయబోతున్నట్లుగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.గతంతో పోల్చితే ఈసారి ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుంటామని ఆయన అన్నారు.30 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా ఉత్తమ్‌ పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు పలువురు ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సిద్దం అవుతున్నారు.మరో వైపు టీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిచేందుకు ప్రయత్నిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube