నిరసన ర్యాలీ చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్..!!

తెలంగాణ రాజకీయాలలో హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి సెగలు కక్కుతోంది.ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని.

 Telangana Congress Staged A Protest Rally Telangana, Congress, Trs  ,  Dalitha-TeluguStop.com

నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ భావిస్తోంది.ఈ క్రమంలో నియోజకవర్గంలో అత్యధిక దళిత జనాభా కలిగి ఉండటంతోనే టిఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునిదళిత బంధు పథకంఅమలు చేస్తున్నట్లు విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇటువంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధ పథకం అమలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

ఈ క్రమంలో  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో డప్పులతో దళితులతో కలిసి నిరసన చేపట్టారు.హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని.

కాంగ్రెస్ నాయకులు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఏది ఏమైనా హుజరాబాద్ నియోజకవర్గం లో కెసిఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం కేవలం ఎన్నికల కోసమే అన్నట్టు విపక్షాలు తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube