తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ విపక్షాలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తూ, ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను తన వైపుకు లాక్కుంటుంది.కేటీఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష అనేది లేకుండా చేయాలని టార్గెట్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే పై కన్నేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీ అయిపోయారు.మరో కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నపళంగా ఎమ్మెల్యేలు ఇలా జారిపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఆకస్మికంగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా చర్చించి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నిర్ణయించుకుంది.అదే సమయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల మార్చిన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.ఇదే సందర్భంగా పార్టీ మారే ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.