ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీటింగ్ వాడి వేడిగా జరిగింది.ఈ సమావేశంలో అన్ని విషయాల గురించి రాహుల్ ఆరా తీశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం అవ్వాలి అనే విషయంపైనా కూడా … రాహుల్ సమావేశం లో చర్చించారు.ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు చెప్పాలని, మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వలన ఏమేరకు ప్రయోజనం కలిగింది తదితర అంశాల గురుంచి తెలంగాణ నేతలను తెలంగాణ నాయకులు చెప్పిన సమాధానం విని రాహుల్ షాక్ అయ్యారట.
అసలు చంద్రబాబు తో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఎక్కువ నష్టపోయామని… వారు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.లోక్ సభ ఎన్నికలలో టిడిపితో పొత్తు అనవసరమని వారు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఉద్యమాలుగా మలచలేకపోయామని నేతలు వివరించారు.చివరి నిమిషం వరకు టికెట్ల ఖరారు చేయడం కూడా తమ కొంప ముంచిందని రాహుల్ దగ్గర తెలంగాణ నాయకులు చెప్పారట.