రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం.ముందు అనుకున్న వ్యూహం ఒకటుంటే ఆ వ్యూహం అమలు చేసిన తరువాత పరిస్థితి వేరే ఉంటుంది.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్.తెలంగాణ ఇచ్చిన తరువాత టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో సత్తా చాటుతుందని, ఏక ఛత్రాధిపత్యం వహించవచ్చనే అతి పెద్ద వ్యూహం వేశారు.కాని తెలంగాణ ఇచ్చిన తరువాత సీన్ రివర్స్ అయింది.టీఆర్ఎస్ అధికారం లోకి రావడం, కాంగ్రెస్ సత్తా చాటడంలో విఫలం కావడం అనే చరిత్ర మన కళ్ళ ముందే జరిగింది.
ఇక అప్పటి నుండి కాంగ్రెస్ జరిగిన ప్రతి ఎన్నికల్లో తన స్థాయికి తగ్గట్టు సత్తా చాటలేకపోయింది.అలా దుబ్బాక, గ్రేటర్ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ చతికిల పడింది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ కంచు కోట అయిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్.ఇక కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నారు.
జానా గెలిస్తే కాంగ్రెస్ కు ప్రజల్లో కొంత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మరి జానా గెలిచి కాంగ్రెస్ కు పూర్వ వైభవం కలిపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.