ఈ రోజు వేకువజామున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే .అయితే… ఆ తరువాత పోలీసులు సాయంత్రం సమయంలో కొడంగల్ లో విడుదల చేశారు.ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న రేవంత్ ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి మరీ టీఆర్ఎస్ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేశారు.
కొడంగల్పై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని అన్నారు.ఇక్కిడి ప్రజలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.‘కొడంగల్కు ముందు నీ కొడుకు కేటీఆర్.ఆ తర్వాత అల్లుడు హరీష్రావు వచ్చారు.ఇప్పుడు నువ్వే వచ్చావు.ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయం ఉంది.ఒక్కొక్కరు కాదు.
ముగ్గురూ కలిసి రండి.కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం’ అని కేసీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు.