రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి.భగ్గుమంటున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రేపు హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపడుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం జరుగనుంది.శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ నుండ్ ఈ ర్యాలీ మొదలవుతుందని చెప్పారు.
పెట్రో ధరల పెంపుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనిపై గవర్నర్ కు వినతి పత్రం అందిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంట్ ని కూడా స్తంభింపచేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.తాము ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని.ఒకవేళ నిర్భందించాలని చూస్తే పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని చెప్పారు.నిరసన చేస్తే ఎన్ని జైళ్లలో పెడతారో.ఎన్ని పోలీస్ స్టేషన్లలో నిర్భందిస్తారో చూస్తామని అన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై మోడీ, కే.సి.లార్ కలిసి ప్రజల నుండి 35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.
టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈఎ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు.గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో పలుచోట్ల పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలు చేస్తుంది.