రాజన్న సిరిసిల్ల లో పర్యటించనున్న కేసీఆర్..!

తెలంగాణా సీఎం కే.సి.

 Telangana Cm Kcr Siricilla District Tour, Cm, District, Kcr, Ktr, Siricilla, Tel-TeluguStop.com

ఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా జిల్లా మొత్తం అధికారుల ఆధీనంలో తీసుకున్నారు.మంత్రి కే.టి.ఆర్ దగ్గర ఉండి ఈ కార్యక్రమాలు చూసుకున్నట్టు తెలుస్తుంది.ఈ పర్యటనలో భాగంగా 210 కోట్ల రూ.లు విలువ గల అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కే.సి.ఆర్ ప్రారంభించనున్నారని సమాచారం.జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించినట్టుగా కే.సి.ఆర్ జిల్లా పర్యటన జరుగనుంది.వరంగల్, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో కే.సి.ఆర్ పర్యటించారు.రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం కే.సి.ఆర్ సరికొత్త భవనాలు ప్రారంభించబోతున్నరని తెలుస్తుంది.రెండు పడకల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.35 ఎకరాల విస్తీర్ణంలో 83 కోట్ల రూ.ల వ్యయంతో మెడపల్లి గ్రామంలో నిర్మించిన 1320 ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.ఆ తర్వాత నర్సింగ్ విద్యార్ధుల కోసం ఏర్పరచిన భవనం కూడా ప్రారంభించనున్నారని తెలుస్తుంది.ఉచిత విద్యతో పాటుగా ఉపాధి శిక్షణ ఇచ్చే విధంగా అంతర్జాతీయ పాఠశాలను నిర్మించారు.

వీటన్నిటిని సీఎం కే.సి.ఆర్ ప్రారంభించనున్నారు. ఇవే కాకుండా ఇంకా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను సీఎం కే.సి.ఆర్ ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణతో పాటుగా అధికారుల పనితీరుని కూడా ఈ పర్యటన ద్వారా తెలుసుకుంటారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube