తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు.అయితే ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున కెసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచాలనే వ్యూహంతో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇక ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేస్తున్నా కెసీఆర్ మాత్రం అసలు మీడియా ముఖంగా స్పందించకుండా ఇటు పాలన నుండి దృష్టి మళ్ళకుండా తెర వెనుక వ్యూహాలు రచిస్తూ తన మార్క్ రాజకీయాన్ని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే ముందస్తుకు వెళ్లనున్నారనే ఒక బలమైన ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతుండగా ముందస్తుపై ఇంకా కెసీఆర్ నుండి కానీ టీఆర్ఎస్ నుండి కానీ స్పష్టమైన క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది.
అయితే ప్రతిపక్షాలు ఇప్పటికే ముందస్తుపై ఒక ప్రణాళికాబద్దంగా నడుస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండే విధంగా ఇప్పటికే క్యాడర్ కు దిశానిర్ధేశం చేసిన పరిస్థితి ఉంది అయితే ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల వాతావరణానికి వచ్చే ఎన్నికల వాతావరణానికి చాలా తేడా ఉండే అవకాశం ఉంది.అయితే ఇప్పటికే కెసీఆర్ బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్దమైన తరుణంలో ఇక రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు రణరంగంగా మారే అవకాశం వందకు వంద శాతం కనిపిస్తోంది.







