తెలంగాణాలో రెండోసారి అధికారం దక్కడంతో సీఎం కేసీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.అందుకే తెలంగాణాలో ఇచ్చిన ఒక్కో హామీని నిలబెట్టుకునేందుకు అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు.
దీనిలో భాగంగానే… గ్రామ కార్యదర్శుల నియామకం ఉత్తర్వులపై సంతకం చేశారు.దీంతో రాష్ట్రంలో కొత్తగా 9,335 మంది గ్రామ కార్యదర్శుల నియామకం జరగనుంది.
కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ ఇది.ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
.