టీడీపీ చంద్రబాబు పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు ఢీల్లీలో ప్రముఖులందరిని కలిసిన కేసీఆర్ నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన చంద్రబాబే లక్ష్యంగా… విమర్శనాస్త్రాలు వదిలారు.హరికృష్ణ శవంపై పేలాలు ఏరుకునే రాజకీయం చేశారని చంద్రబాబుపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హరికృష్ణ కూతురికి ఇప్పుడేం న్యాయం చేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు.చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ చేసిన ఆయన మాటల్లోనే ఒక్కసారి చూస్తే….
‘మొన్న పాపం అమాయకురాలు.ఆమెను తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను తీసుకొచ్చి పెట్టిండు.హరికృష్ణ చావును కూడా.హరికృష్ణ శవం మీద పేలాలేరుకుని రాజకీయం కాదు నీది చంద్రబాబునాయుడు నీది.అవునా కాదా.ఇప్పుడేమన్నా చేస్తవా ఆ అమ్మాయికి.
నీకు నిజాయితీ ఉందా.ఏం చేయడు.
అంతకు ముందు హరికృష్ణ లేదు.హరికృష్ణ బిడ్డ లేదు.
ఆయన చావంగనే దాని మీద సొమ్ము చేసుకోవచ్చని చెప్పి.ఆయన చావు సింపతీని సొమ్ము చేసుకోవచ్చని చెప్పి.
అంత నీచ రాజకీయ నాయకుడు.ఇంతకన్నా నీచత్వం ఉంటదా.
అంటే ఎలక్షన్ ముందు పనికొస్తే వాడుకోవాలా లేకపోతే వదిలేసెయ్యాలా.ఫినిష్.
ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా’ అని కేసీఆర్ బాబు మీద ఫైర్ అయ్యారు.