నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెలరోజుల క్రితం సర్జరీలు జరిగిన విషయం తెలిసిందే.కాగా రోజాకు గతేడాదే శస్త్ర చికిత్స చేయాల్సి ఉండగా కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు.
జనరల్ చెకప్ కోసం మార్చి 24న ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో అంగీకరించిన రోజాకు చెన్నైలోని మలర్ ఆస్పత్రిలో రెండు మేజర్ సర్జరీలు జరిగిపోయాయి.
అయితే డాక్టర్ల సూచనతో అక్కడే విశ్రాంతి తీసుకుని డిశ్చార్జి అయ్యిన రోజా ప్రస్తుతం చెన్నైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇదివరకే పలువురు నేతలు రోజాకు ఫోన్ చేసి పరమార్శించగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్తో హోం ఐసోలేషన్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న ఫోన్ చేసి రోజా ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.